“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్న చందంగా ఇంటి సభ్యుల మద్య పోటీ మొదలైంది. ఈ సీజన్ బిగ్ బాస్ 5 లోకి 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలవ్వగా.. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. వారి ముందు ఒక కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ ని పిలుస్తూ.. ఎవరిపై కంప్లైంట్ చేస్తున్నారో, ఎందుకో చెప్పాలని అడిగారు నాగార్జున. దాంతో ఇంటి సభ్యులకు ఒకింత ఇబ్బంది పడుతూనే తమ కంప్లైంట్ వెల్లడించారు. అదే సమయంలో ఇంటి సభ్యులకు తాము చేసిన తప్పిదాల గురించి వివరించి చురకలు అంటించారు నాగార్జున.
సన్నీ.. సిరిపై కంప్లైంట్ చేస్తూ.. ‘హౌస్ లోకి రాగానే ఫస్ట్ ఫ్రెండ్ అయింది. కానీ తరువాత ఇద్దరికీ పడలేదు. వెళ్లేలోపు మళ్లీ ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అవ్వాలని’ చెప్పాడు. తరువాత సిరిని ఎవరిపై కంప్లైంట్ చేస్తావ్ అని నాగార్జున అడగ్గా.. షణ్ముఖ్ వైపు చూపించింది. దాంతో షణ్ముఖ్ ఒకింత అసహనానికి గురయ్యాడు. ‘నువ్ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా.. అని అన్నాడు కదా..’ ‘అయినా నువ్ ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావ్’ అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు నాగార్జున.
షణ్ముఖ్.. ప్రియాంకపై కంప్లైంట్ చేస్తూ.. ‘తనను తాను తగ్గించుకొని పక్కవాళ్లను పైన పెడుతుందని’ చెప్పాడు. తరువాత ప్రియాంక.. సన్నీపై కంప్లైంట్ చేస్తూ ‘గేమ్ లో తన బాల్స్ మొత్తం తీసేసుకున్నాడని’ రీజన్ చెప్పింది. అదే సమయంలో ప్రియాంకపై తనకు కూడా ఓ కంప్లైంట్ ఉందని అన్నారు. హౌస్ లో ఈరోజు శ్రీరామ్ అనారోగ్యంగా ఉండడానికి కారణం పింకీ సొంత వైద్యమేనంటూ నాగార్జున చురకలు అంటించారు. శ్రీరామ్ తనకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవని ఈ మూడు రోజులు ఇంటి సభ్యులు తనను చాలా బాగా చూసుకున్నారని అన్నాడు. ఇక శ్రీరామ్ నీపై చిన్న కంప్లైంట్ ఉందంటూ.. ‘బల్బ్స్ టాస్క్ లో తన బదులుగా షణ్ముఖ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఇండికేషన్స్ ఎందుకిచ్చావ్’ అని నాగార్జున ప్రశ్నించారు.
మానస్.. షణ్ముఖ్ పై కంప్లైంట్ చేస్తూ.. ‘సన్నీకి ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా.. నీ ఫ్రెండ్ కి నువ్ చెప్పు అని నాకు చెప్తున్నాడు’ అంటూ రీజన్ చెప్పాడు. షణ్ముఖ్ చెప్పే ప్రయత్నం చేయగా.. ‘హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోవాలి’ అంటూ నాగార్జున అన్నారు. అదే సమయంలో మానస్ పై ఓ కంప్లైంట్ ఉందని.. గేమ్ లో నీకు నువ్ బాగా కౌంట్ చేసుకున్నావ్.. కానీ సన్నీకి కౌంట్ చేసినప్పుడు ఎందుకలా చేశావ్’ అని ప్రశ్నించారు. ప్రియాంక, కాజల్ లు కన్ఫ్యూజ్ చేశారని చెప్పాడు. తరువాత కాజల్.. సన్నీపై కంప్లైంట్ చేసింది. ‘ఏమైనా మాట్లాడినా.. ఏదైనా చెప్పినా.. ఆత్రం, ఆత్రం.. ఆగు ఆగు అంటూ’ తనపై అరుస్తున్నాడని కాజల్ చెప్పింది. తర్వాత సన్నీతో సారీ చెప్పించాడు. కాజల్ పై తనకొక కంప్లైంట్ ఉందని నాగార్జున చెప్పారు. ‘ఫోకస్’ టాస్క్ లో ఎందుకు హౌస్ మేట్స్ ని డిస్టర్బ్ చేశావని అడిగి.. ఇంకెప్పుడు అలా చేయొద్దని గట్టిగానే చురకలంటించారు నాగార్జున.