ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత లక్ష్మిపార్వతీ తల్లి మరణించిన సంగతి తెలిసింది. ఇలా వరుస విషాదాలతో వారి అభిమానులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. తాజాగా వెైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి, మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో స్థానిక కొలుసు పార్థసారథి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో రెడ్డయ్య భౌతిక కాయానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పెనమలూరు ఎమ్మెల్యే పి. పార్థసారథి తండ్రి రెడ్డయ్య శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈనేపథ్యంలో పార్థసారథి ఇంటికి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ రెడ్డయ్య యాదవ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యుల్ని సీఎం జగన్ పరామర్శించారు. సీఎం వెంట మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు. ఇక రెడ్డయ్య విషాయనికి వస్తే.. ఆయన గతంలో మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. అంతేకాక ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.
ప్రస్తుతం ఆయన రాజకీయ వారసుడిగా కొలుసు పార్థసారధి కొనసాగుతున్నారు. గత కొంతకాలం నుంచి రెడ్డయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారు జామున చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం మెవ్వ మండలం కారకంపాడులో నిర్వహించున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరీ.. రెడ్డయ్య మృతిపై మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.