వైఎస్సార్ సీపీ పెనమలూరు ఎమ్మెల్యే గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు.
గుండెపోటు.. ప్రస్తుత కాలంలో ఈ మాట వింటే చాలు ప్రజల గుండె ఆగినంత పనవుతోంది. ఎక్కడ చూసినా గుండెపోటు కేసులు, వాటి ద్వారా చోటుచేసుకుంటున్న మరణాలు ఎక్కువయిపోతున్నాయి. ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండెపోట్లు వస్తున్నాయి. 15 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులు కూడా గుండెపోట్ల బారినపడుతూ ఉన్నారు. తాజాగా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఒకరు గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పింది చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెనమలూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని అశోక్ నగర్ లోని టాప్ స్టార్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆయన్ని పరీక్షించిన వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు.
పార్థసారథి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పార్థసారథి గుండెపోటుకు గురయ్యారన్న సంగతి తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నేతలు, ఆయన అభిమానులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన్ని పరామర్శించి వెళుతున్నారు. కాగా, కొలుసు పార్థసారిథి 2004 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉయ్యూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అదే సంవత్సరం మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత వచ్చిన 2009 ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు. 2014లో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు.