ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన నాటి నుంచి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యావ్యవస్థలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నాడు-నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. కార్పొరేట్ స్కూల్ నియంత్రణ కోసం పలు ఆదేశాలు సైతం ఇచ్చారు. తాజాగా కార్పొరేట్ విద్యా సంస్థలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో వెలువడనున్న పదో తరగతి పరీక్ష ఫలితాలకు ర్యాంకులను ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థ ర్యాంకులు ప్రకటిస్తే.. కనీసం మూడేళ్లు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షని జగన్ సర్కార్ తెలిపింది. అంతేకాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తామని పేర్కొంది.ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి ఏడాది పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు ఆయా కార్పొరేట్ విద్యాసంస్థలు టీవీ చానెళ్లలో, వార్తపత్రికల్లో భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. ఫలితాలు వచ్చిన నాటి నుంచి వారాల తరబడి ఈ ప్రచారం కొనసాగుతోంది. అంతే కాకుండా పలువురు సెలబ్రిటీలను సైతం తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని భారీగా యాడ్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోసపూరిత ప్రకటనలపై జగన్ ప్రభుత్వం కన్నెర్ర జేసింది. తమకే ఎక్కువ ర్యాంకులంటూ ప్రకటనలు ఇస్తే జైలుశిక్షలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఆయా కార్పొరేట్ విద్యా సంస్థల పరిస్థితి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది. వాస్తవానికి ఆయా విద్యాసంస్థల్లో చదివే పదో తరగతి విద్యార్థులు లక్షల్లో ఉంటారు.
ఇదీ చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీఎస్ ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు..!
కానీ ర్యాంకులు మాత్రం వందల్లోనే ఉంటున్నాయి. అయినా సరే తమకే ఎక్కువ ర్యాంకులు వచ్చాయంటూ ఆయా విద్యా సంస్థలు మీడియాలో మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఫస్టు ర్యాంకు తమకే వచ్చిందంటే తమకే వచ్చిందని విద్యా సంస్థ పోటీపడుతుంటారు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ సంస్థలు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి.. విద్యావ్యవస్థపై జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.