నేటి సమాజంలో స్త్రీలకు రక్షణ కరవైపోతోంది. బయటికి వెళ్లిన మహిళలు క్షేమంగా వస్తారన్న గ్యారంటీ లేకుండా పోతోంది. తాజాగా విశాఖపట్నంలోని పరవాడలో చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
నేటి సమాజంలో స్త్రీలకు రక్షణ కరవైపోతోంది. ఇంటా, బయట ఎక్కడ కూడా వారికి రక్షణ ఉండటం లేదు. బయటికి వెళ్లిన మహిళ సురక్షితంగా ఇంటికి వస్తుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది. అందుకు తగ్గట్లుగానే.. మహిళల అదృశ్య కేసులు కూడా రోజురోజు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖపట్నం తాలుకా పరవాడలో ఓ వివాహిత అదృశ్యం అవ్వడం తీవ్ర కలకలం రేపింది. బయటకి వెళ్లోస్తానని చెప్పి వెళ్లిన ఆ మహిళ 3 రోజులు అవుతున్నా గానీ ఇంటికి తిరిగిరాలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెదముషిడివాడ శివారు గండివానిపాలెం గ్రామానికి చెందిన మడక దేవి-రాము భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. ఇక దేవి తల్లిదండ్రులు గండివానిపాలెంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వారి ఇంటి నుంచి ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు బయటకు వెళ్లోస్తానని చెప్పి వెళ్లింది. కానీ మళ్లీ తిరిగిరాలేదు. దాంతో చుట్టు పక్కల వెతికినా లాభంలేకుండా పోయింది. చివరికి చేసేది ఏంలేక.. దేవి భర్త రాము పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పరవాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.