కాలం మారుతోంది.. కాలంతో పాటు మనుషులూ మారుతున్నారు.. మనిషితో పాటు ఆలోచనలూ మారుతున్నాయి. ఈ ఆలోచనలతోనే మాట మారుస్తున్నాడు నేటి మానవుడు. తనకు దక్కేదాక ఒక మాట.. దక్కినాక మరో మాట చెప్తూ నమ్మిన వారిని మోసం చేయడం నేటి సమాజంలో ఓ అలవాటుగా మారింది. తాజాగా ఓ ప్రబుద్దుడు అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వదిలేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
SI దస్తగిరి తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందులకు చెందిన శిరీష, చిత్తూరు కు చెందిన నిరంజన్ కుమార్ లు విజయవాడలో ఒకే కాలేజిలో చదువుకున్నారు. ఈ క్రమంలో నిరంజన్ శిరీషను ప్రేమించాలని వెంట పడ్డాడు. దీంతో ఇద్దరి ఇష్టంతో విజయవాడ దుర్గమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శిరీష గర్భం దాల్చింది. దీంతో ఆమెను తీసుకుని నిరంజన్ తన స్వగ్రామానికి వచ్చాడు.
శిరీష గర్భం దాల్చిన విషయం ఇంట్లో చెప్పగా నిరంజన్ తల్లిదండ్రులు మాకు నువ్వంటే ఇష్టం లేదు వేరే పెళ్లి చేసుకో అంటూ వాదించారు. దీంతో శిరీష గట్టిగా నిలదీస్తే కొన్ని రోజులు ఆగు చూద్దాం అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో శిరీష చేసేది ఏమీ లేక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అదీ కాక తనకు మాయ మాటలు చెప్పి తన కడుపు కూడా తీయించాడని వాపోయింది. నిరంజన్ ఇప్పుడు తన బంధువుల అమ్మాయితో పెళ్లికి సిద్దమయ్యాడు అని ఫిర్యాదులో పేర్కొంది. శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.