ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందమైన నగరం విశాఖపట్నం. విశాఖ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేదిఆర్.కె.బీచ్. రామకృష్ణ మఠం ఈ బీచ్ కు సమీపంలో ఉండడం వలన రామకృష్ణ బీచ్ అనే పేరు వచ్చిందని అంటారు. దీనిని ఆర్.కె.బీచ్ అని కూడా పిలుస్తారు. నగరానికి వచ్చే పర్యాటకులను మొట్ట మొదట ఆకర్షించే బీచ్ ఇదే. సాయంత్రం వేళ జనసందోహంతో ఈ బీచ్ కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ బంగారంలా మెరిసిపోయే విశాఖ ఆర్కే బీచ్లోని ఇసుక గురువారం నల్లగా మారిపోయింది. ఈ మార్పును చూసి సందర్శకులు ఆందోళన చెందారు. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్టణం ఆర్కే బీచ్లోని ఇసుక గురువారం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. ఇసుక ఉన్నట్టుండి నల్లగా కనిపించడంతో సందర్శకులు ఆందోళనకు గురయ్యారు. దాంతో అటు వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. అయితే ఇసుక ఇలా నల్లగా మారడాన్ని తాము ఇప్పటి వరకు చూడలేదని.. దీని వల్ల ఎదైనా ప్రమాదం జరుగుతుందా అని స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. దీంతో ఈ టాకి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
విశాఖ ఆర్.కె. బీచ్ లో ఇసుక అకస్మాత్తుగా నల్లగా ఎందుకు మారిందన్న విషయం గురించి ప్రొఫెసర్ ధనుంజయరావు చెబుతూ.. ‘ సముద్రంలోని ఎక్కువ శాతం మురికి ఉంటుంది.. అది కొన్ని సార్లు ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. అలాగే సముద్రంలో ఉండే ఇనుప రజను ఎక్కువైనా ఒడ్డుకు వచ్చి చేరుతుంది. దీనికి కారణంగానే ఇసుక నల్లగా మారి ఉండవొచ్చని అన్నారు. అయితే ఇసుకను పూర్తి స్థాయిలో పరిశోధిస్తే కానీ విషయం ఏంటో స్పష్టమవుతుంది’ అని వివరించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.