ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. మన్యం జిల్లాలోని సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ భారీ పేలుడు జరిగింది. సాలూరు టౌన్ పీఎస్ లో సీజ్ చేసిన బాణాసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ వైపు వెళ్లారు. అయితే భారీ పేలుడు సంభవించిన సమయంలో పోలీసులు అక్కడి నుంచి వెంటనే బయటకు వైపు పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగింది. ఘటన స్థలంలో మంటలను అదుపు చేసింది. ఇక, బాణాసంచాను రెండు నెలల క్రితం సీజ్ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. బాణాసంచా పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ గోడలకు దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: TDP మహిళా నేత వంగలపూడి అనితకు బ్యాంక్ నోటీసులు..!
ఇదీ చదవండి: చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని మాస్ వార్నింగ్!