తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు బ్యాంక్ అధికారులు షాకిచ్చారు. రెండు నెలల్లోగా తమ దగ్గర తీసుకున్న రుణం చెల్లించకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. తాజాగా కర్ణాటక బ్యాంగ్ వంగలపూడి అనితకు బ్యాంక్ నోటీసులు పంపింది. తమ వద్ద తీసుకున్న 82, 71, 584 రూపాయల మొత్తాన్ని చెల్లించాలంటూ హైదరాబాద్ బంజారాహిల్స్లోని కర్ణాటక బ్యాంక్ అసెట్ రికవరీ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఈ నోటీసులను పంపించింది. వంగలపూడి అనిత 2015లో విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో లోక్రిష్ గోకుల్ లేఔట్లో తన పేరుతో ఉన్న స్థలాలను విశాఖపట్నంలో ఉన్న కర్ణాటక బ్యాంకులో తాకట్టు పెట్టి.. 82 లక్షల రూపాయలకు పైగా రుణం తీసుకుంది. ఏడేళ్లు గడుస్తున్నప్పటికి.. సకాలంలో ఆ రుణాన్ని చెల్లించకపోవడంతో.. కర్ణాటక బ్యాంకు అనితకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీన పత్రికా ప్రకటనతోపాటు అనితకు నోటీసులు జారీ చేసింది. తమ వద్ద తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా 60 రోజుల్లో చెల్లించాలని.. లేని పక్షంలో తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు అనితను హెచ్చరించింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: TDP అధికారంలోకి వస్తే కొడాలి నానిపై ప్రతీకారం తీర్చుకుంటాం: వంగలపూడి అనిత ఇది కూడా చదవండి: వంగలపూడి అనితకు వైసీపీ నేత చెంగళ వెంకట్రావ్ ఒపెన్ సవాల్.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు రెడీనా!