భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు సహజం. ఏదైనా చిన్న గొడవ జరిగినా కాసేపటి తరువాత మళ్లీ ఇద్దరు ఒక్కటవుతుంటారు. అయితే నేటికాలంలో మాత్రం దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు ఎడబాటుకు దారి తీస్తున్నాయి. అలానే ఓ సాఫ్ట్ వేర్ దంపతులు పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ చేశారు. కానీ సీఐ చేసిన పనికి వారిద్దరు సెట్ అయ్యారు.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు సహజం. ఏదైనా చిన్న గొడవ జరిగినా కాసేపటి తరువాత మళ్లీ ఇద్దరు ఒక్కటవుతుంటారు. అయితే నేటికాలంలో మాత్రం దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు ఎడబాటుకు దారి తీస్తున్నాయి. అలానే తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన దంపతులు కూడా గొడవపడి విడిపోయారు. చివరకు వారిద్దరిని పుట్టిన రోజు వేడుక తిరిగి ఒకటి చేసింది. అది కూడా పోలీసుల సమక్షంలో బర్త్ డే విషెస్ ద్వారా ఆ దంపతులు ఒకటయ్యారు. ఆ దంపతులు ఒకటయ్యే క్రమంలో పోలీస్ స్టేషన్ ఆసక్తకరమైన సన్నివేశం కూడా చోటుచేసుకుంది. మరి.. ఆ దంపతుల పూర్తి స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు ఐటీ ఉద్యోగులుగా పని చేస్తూ హాయిగా జీవిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇద్దరూ వెనక్కు తగ్గకపోవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చివరకు ఆ గొడవ తర్వాత ఇద్దరు విడివిడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ పంచాయితీ చంద్రగిరి పోలీస్ స్టేషన్కు చేరింది. ఆ భార్యాభర్తలతో పాటు ఇరు కుటుంబాల పెద్దల్ని కూడా పోలీస్టేషన్ కు పిలిపించారు. అక్కడ కూడా భార్యాభర్తలు ఎవరి దారి వారిదే అన్నట్లు కూర్చుకున్నారు.
సర్థి చెప్పాల్సిన పెద్దలు కూడా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన సీఐ.. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడారు. సీఐ మాటాలకు వారందరూ సర్ధుకున్నారు. అలానే సీఐ ఆ దంపతులకు కూడా సర్థి చెప్పారు. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వారిద్దరిలో ఎవరూ మెట్టు దిగలేదు. అప్పటికే సమయం అర్థరాత్రి 12 దాటి.. మరుసటి రోజు కూడా ప్రారంభమైనది. ఇదే సమయంలో సీఐకి ఓ మంచి వార్త తెలిసింది. అది ఏమిటంటే.. ఆ రోజే భర్త పుట్టిన రోజు కూడా వచ్చింది. దీంతో ఒక్కసారి భర్తకు పుట్టిన రోజు శుభకాంక్షలు చెప్పమని కోరుతాడు.
అలా భార్యతో భర్తకు బర్త్ డే విషెస్ చెప్పించారు. ఇద్దరూ ఒకరి చేతులు కలిపారు. ఇక అంతే వారిద్దరు ఒకటిగా మారిపోయారు. అలానే అత్తింటివాళ్లు కూడా అల్లుడికి బర్త్ డే విషెస్ తెలిపారు. అప్పటి వరకు తూర్పు పడమరలా ఉన్న ఆ ఇద్దరూ ఒకటిగా కలిసి ఇంటికి వెళ్లిపోయారు. భార్యాభర్తల పంచాయితీనీ పరిష్కరించి.. వారి కాపురాన్ని నిలబెట్టిన సీఐపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. మరి.. సీఐ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.