మనిషి జీవితం నీటి బుడగలాంటిది కాబట్టి ఏక్షణంలో టప్ అంటుందో ఎవరు చెప్పంలేము. మరణం అనేది ఇలా ఉంటుందా అనే సందేహం వచ్చేలా కొన్ని ఘటనలు మన చుట్టు పక్కల జరుగుతుంటాయి. మిరప తోటలో పనులకు వెళ్లిన ఓ మహిళ విషయంలో అలాంటిదే జరిగింది.
మరణం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరం చెప్పలేము. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కొన్ని క్షణాల తరువాత విగతజీవిగా మారుతున్నారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన మరణాలను మనం అనేకం చూశాం. అంతేకాక చాలా మంది.. తమ వారిని మృత్యువు నుంచి తప్పించేందుకు చివర వరకు పోరాటం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మృత్యుంజయులు తిరిగి వస్తుంటారు. కానీ మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడేందుకు ఎంత పోరాడిన ఫలితం ఉండదు. తాజాగా ఓ మహిళ విషయంలో అలాంటిదే జరిగింది. పాము కాటేసిన మహిళను.. మరణించిన తరువాత కూడా బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం కి చెందిన షేక్.ఖాసింబీ(37) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అదే గ్రామంలోని 10వ వార్డు సభ్యురాలుగా గెలుపొందారు. తోటివారితో కలసి ఆమె మిరప పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలానే శుక్రవారం ఉదయం మిరప తోటలో కలుపు తీసేందుకు పది మంది కూలీలతో కలిసి వెళ్లింది. సరదగా నవ్వుకుంటూ అందరూ కలుపు తీస్తున్నారు. ఖాసింబీ కూడా ఓ పక్కన ఉండి కలుపు తీస్తుండగా గడ్డిలో నుంచి పాము వచ్చి ఎడమ కాలిపై కాటు వేసింది. భయంతో ఆమె కేకలు వేయడంతో తోటి కూలీలు కాలికి కట్టుకట్టారు. అనంతరం బైక్ పై ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఆమె అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
అయితే ఆమెను కాపాడేందుకు ఇంజెక్షన్లు చేసి, సీపీఆర్ వంటి వివిధ ప్రయత్నాలు చేశారు. ఊపిరితిత్తులపై తీవ్ర విష ప్రభావం పడి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి చెందినప్పటికి నాటు వైద్యంతో బతుకుతుందేమోనని చిన్న ఆశతో అటువైపు కూడా ప్రయత్నాలు చేశారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు పట్టువిడవకుండా ఎంత పోరాడిన ఫలితంలేకుండా పోయింది. ఉదయం కూలి పనులకు వెళ్లిన ఆమె సాయంత్రానికి శవమై తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.