ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వాటిల్లో వాలంటీర్ వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు.. ప్రభుత్వ పథకాలను ప్రజల అందజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదించింది ఈ వ్యవస్థ . అయితే కొంత మంది వాలంటీర్ చేసే పనుల వలన ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థపై నమ్మక పోతుంది. గతంలో ఓ వాలంటీర్ డబ్బులతో పరారైన విషయం తెలిసిందే. తాజాగా ఓ వాలంటీర్.. ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాల చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి లంకకు చెందిన బూసి సతీష్(23) గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ పథకాల దరఖాస్తుల కోసం ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఇలా కొన్ని రోజుల పాటు పని పేరుతో ఆ బాలిక ఇంటి వైపు వెళ్తుండే వాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు బాలిక నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ ఆర్.కె.శుభ శేఖర్ తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.