ఇటీవల సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇటీవల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు (66) కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దొమ్మేటి వెంకటేశ్వరరావు ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం గమనార్హం. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో ఆప్తుడిగా ఉండేవారని అంటారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతూ.. నియోజక అభివృద్దికి కృషి చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ఆయన వెంట ఉంటూ మద్దతు పలికారు. దొమ్మేటి పట్ల వైఎస్ జగన్ కి కూడా ఎంతో అభిమానం చూపించేవారు. ఆయన మృతి పట్ల ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.