విద్యార్థులను సక్రమైన మార్గంలోకి నడిపించాల్సిన ఓ మాస్టారు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇతగాడి లైంగిక వేధింపులపై స్పందించిన ఉన్నతాధికారులు.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
బాధ్యత గల వృత్తిలో ఉన్న ఓ ఉపాధ్యాయుడు బరితెగించి ప్రవర్తించాడు. విద్యార్థులను సక్రమైన మార్గంలోకి నడిపించాల్సింది పోయి.. ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇతగాడి లైంగిక వేధింపులపై స్పందించిన ఉన్నతాధికారులు.. అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
శ్రీ సత్యసాయిజిల్లా కదిరి పరిధిలోని నల్లగుట్టపల్లె స్కూల్ లో జీవీ ఆదినారాయణ అనే వ్యక్తి ఇంఛార్జ్ హెడ్ మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడే చదువు చెబుతున్న ఈ మాస్టారు.. రాను రాను తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేశాడు. విషయం ఏంటంటే? 8,9,10 తరగతి విద్యార్థినులను కొంతమందిని లైంగికంగా వేధించినట్లు తెలుస్తుంది. మీకు పుట్టుమచ్చలు ఎక్కడున్నా చూపించాలంటూ వేధింపులకు దిగేవాడట. అయితే మాస్టారు దారుణాలను ఆ విద్యార్థినులు ఇన్నాళ్లు ఎవరికీ చెప్పుకోలేదు.
ఇదిలా ఉంటే జవవరి 24న స్కూల్ లో జరిగిన బాలికల దినోత్సవం సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మాపై జరిగిన దారుణాన్ని వారికి చెప్పాలని అనుకున్నారు బాధిత విద్యార్థులు అనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ఆ విద్యార్థినులు మాస్టారు దారుణాన్ని వారికి పూసగుచ్చినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సంస్థ ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు.. జరిగింది నిజమేనని తెలుసుకుని హెడ్ మాస్టార్ ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్కూల్ విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఇతగాడి దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.