ఒక పక్క పేదరికం.. మరోపక్క చదవాలన్న జిజ్ఞాస. అదే ఆమెను పీహెచ్డీ పట్టాదారునిగా చేసింది. సాధారణ కూలీగా ఉన్న భారతి.. డాక్టర్ భారతిగా మారారు. ఇది పూర్తిగా ఆమె కష్టమే. అయితే సుమన్ టీవీ కథనాలకు వచ్చిన స్పందనతో భారతి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉద్యోగం వచ్చింది.
కూలి పనులు చేస్తూ పీహెచ్డీ పట్టా పొందిన సాకే భారతి నేడు ఎంతోమంది యువతకు ఆదర్శం. యువతకు మాత్రమే కాదు తనలా పేదరికంలో మగ్గుతున్న పేదలకు, సామాన్యులకు ఆమె ఒక దిక్సూచి. ఒక పక్క కూలి పనులు చేస్తూనే.. మరోపక్క చదువుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. కూలి పనులు చేస్తూ పీహెచ్డీ పట్టా సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దానికెంతో కఠోర దీక్ష, శ్రమ, కష్టం కావాలి. అన్నిటికంటే ముందు ఆర్థిక ప్రతికూల పరిస్థితులను సవాలు చేస్తూ ఆత్మస్థైర్యం కావాలి. అది ఆమెకు ఉంది కాబట్టే ఆమె ఈ పట్టాను సాధించగలిగారు. ఈమె ప్రతిభకు మెచ్చిన ఎమ్మెల్సీ కుంబా రవిబాబు భారతికి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేసే అవకాశం కల్పించారు.
అయితే భారతికి ఇంతలా ఎమ్మెల్సీ దృష్టిలో పడటానికి సుమన్ టీవీ కూడా కీలక పాత్ర పోషించింది. ప్రతిభావంతులను గుర్తించి ఇంటర్వ్యూలు చేయడం సుమన్ టీవీ ప్రత్యేకత. గతంలో పలువురిని ఇంటర్వ్యూ చేసి వారి అభివృద్ధికి, భవిష్యత్తుకి సుమన్ టీవీ పూల బాటలు వేసేలా సమాజాన్ని చైతన్య పరిచింది. గతంలో అలేఖ్య అనే అమ్మాయి విషయంలో కూడా సుమన్ టీవీ కథనం ఎంతోమందిని కదిలించింది. తండ్రి వదిలేశాడు, తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అయినప్పటికీ అలేఖ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్ లో 9.7 జీపీఏ సాధించింది. ఆ తర్వాత పై చదువులు ఎలారా భగవంతుడా అని ఆలోచిస్తున్న సమయంలో సుమన్ టీవీ కథనం రాసి ఆమె పై చదువులకు ఆర్థిక సహాయం అందేలా చేసింది.
సుమన్ టీవీ రాసిన కథనం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో కొందరు స్పందించి ఆమె చదువుకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇలా కష్టం ఉందని తెలిస్తే సుమన్ టీవీ అక్కడ వాలిపోతుంది. వారి జీవన గమనానికి బాటలు వేసేలా ప్రయత్నిస్తుంది. తాజాగా భారతి విషయంలో అదే జరిగింది. ఆమె కూలి పనులు చేసుకుంటూ పీహెచ్డీ పూర్తి చేశారు. అందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆ విజయం పూర్తిగా ఆమె సొంతమే. అయితే సుమన్ టీవీ ఆమెను కలిసి ఇంటర్వ్యూ చేయడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది.
స్ఫూర్తిదాయకమైన భారతి కథను ఈ ప్రపంచానికి విస్తృతంగా పరిచయం చేసిన ఘనత సుమన్ టీవీదే. ఎక్కువ మందికి భారతి కథ రీచ్ అవ్వడంతో ప్రజలు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పారు. మరోవైపు అధికారుల దృష్టిలో కూడా భారతి పడ్డారు. సుమన్ టీవీ చేసిన భారతి ఇంటర్వ్యూ చూసి ఎమ్మెల్సీ కుంబా రవిబాబు సుమన్ టీవీకి రావడం.. ఇంటర్వ్యూలో ఆమెకు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేరే అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ విధంగా సుమన్ టీవీ కథనంతో భారతి తన ఆర్థిక విజయానికి బాటలు వేసుకున్నారు.