ఈ మద్య కాలంలో తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోని పిల్లలు ఉన్నారు. నవమాసాలు కనీ పెంచిన తల్లి, చిన్నప్పటి నుంచి చదువు చెప్పించి ప్రయోజకుడిని చేసిన తండ్రిని వృద్దాశ్రమాలకు సాగనంపుతున్న పిల్లలు ఉన్నారు. కన్నతల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేసిన కొడుకులకు సంబంధించిన వార్తలు చదువుతూనే ఉన్నాం. అలాంటిది ఓ కొడుకు తన జీవితాన్నే ఫణంగా పెట్టి తండ్రికి పునర్జన్మని ఇచ్చాడు. మృత్యువుతో పోరాడుతున్న తన తండ్రి బాధ చూడలేక ఎవరూ చేయలేని గొప్ప త్యాగం చేసి తన తండ్రిని బతికించుకున్నాడు. ఆ కొడుకు చేసిన త్యాగం ఎంతటి కఠినాత్ములకైనీ కన్నీరు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళితే..
గుంటూరు కి చెందిన నర్రా రాంబాబు అనే వ్యక్తి కొంత కాలంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. హాస్పిటల్ కి వెళ్లి వైద్యులకు చూపించుకోగా అతని కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా వెంటనే కాలేయ మార్పిడి చేయించకపోతే చనిపోతారని చెప్పారు డాక్టర్లు.
తండ్రి పరిస్థితి దారుణంగా తయారు కావడంతో కొడుకు చలించిపోయాడు. ఇంజనీరింగ్ చదువుతున్న రాంబాబు తనయుడు కొర్రా నవీన్ గొప్ప త్యాగానికి సిద్దమయ్యాడు. తన తండ్రిని బతికించుకోవడం కోసం తన కాలేయం లో 64 శాతం ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది.. ప్రస్తుతం తండ్రీకొడుకులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
తల్లిదండ్రులను వయసు పైపడగానే వృద్దాశ్రమాలకు పంపడం.. తమ స్వార్థం కోసం పరితమపించే ఈ కాలంలో ఇలాంటి గొప్ప కొడుకు పుట్టడం తల్లిదండ్రుల అదృష్టం అంటూ ఈ వార్త తెలిసిన బంధుమిత్రులు, నెటిజన్లు నవీన్ ని ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నారు. ఇంత గొప్ప కొడుకుపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: తోపుడు బండి వ్యాపారికి ఏకే-47లతో ఇద్దరు బాడీగార్డ్స్.. ఎందుకంటే!