నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. వివిధ కారణలతో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొందరు చేసే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు అమాయకులు బలవుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా వాహనం డ్రైవింగ్ చేయడం వంటి వివిధ కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. అలానే ముందు వెళ్లే వాహనాన్ని క్రాస్ చేసి వెళ్లాలనే ఆలోచనతో కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా అలా ఓ ఆటోను అధికమించబోయిన మరో ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీసత్య సాయి జిల్లా డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం, బళ్లారి హైవేపై సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జాతీయ రహదారిపై రెండు ఆటోలు ఢికొని బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో పది మంది మహిళా కూలీలు గాయపడ్డారు వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నాటక రాష్ట్రం కోనాపుర, పైగాన్, మల్లాపుర గ్రామాలకు చెందిన సుమారు 20 మంది కూలీలు పనుల నిమిత్తం ఆటోలో శంకరబండకు వెళ్లారు. పనులు ముగించుకుని అదే ఆటోలో తిరిగి తమ స్వగ్రామాలకు బయల్దేరారు. మార్గం మధ్యలో వీరికి ముందుకు కూల్ డ్రింక్స్ లోడుతో ఓ ఆటో వెళ్తుంది.
అయితే ఆ ఆటోను కూలీలతో వెళ్తున్న ఆటో డ్రైవర్ అధిగమించాలని భావించాడు. అలా కూల్ డ్రింక్స్ ఆటో సీసాల ఆటోను అధికమించే క్రమంలో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం 10 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లక్ష్మీ, రమ్య, వనజ, వన్నూరమ్మ, లక్ష్మక్క, దేవమ్మ, కవిత, అంజినమ్మ, మారెమ్మ, వన్నక్కకు గాయాలయ్యాయి. ఆటోల ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం కొందరిని అనంతపురం, బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగం ప్రమాదమని తెలిసిన కూడా కొందరు వినిపించుకోరు. చివరకు వారు చేసిన తప్పుకు అమాయకులు గాయాలపాలవ్వడమే కాక ప్రాణాలు కోల్పోతున్నారు. కాస్తా నిదానంగా వెళ్లి ఉంటే.. అందరు సురక్షితంగా ఇంటికి చేరేవారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.