నిత్యం ఏదో ఒక్క ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు.
నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అతివేగం, నిద్రమత్తు, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో అంగవైకల్యం ఏర్పడి..అతి కష్టం మీద జీవితాన్నిసాగిస్తున్నారు. ప్రజలకు సురక్షితంగా భావించే ఆర్టీసీ బస్సులు కూడా ఇటీవల కాలంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10మందికి గాయాలైనట్లు సమాచారం. ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు బోల్తా పడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఎన్టీఆర్ జిల్లాలోని చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న ప్రయాణికులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేసి వారి గమ్య స్థానాలకు తరలించారు.
విజయవాడ డిపోకు చెందిన ఏపీ 16 జడ్ 0599 నెంబర్ గల బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ లోని మియాపూర్ కు మంగళవారం రాత్రి బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గరకు చేరుకునే సరికి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సును నియంత్రించేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. బస్సు ఒక పక్కకు ఒరుగుతూ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, హైవే పోలీసులు స్పందించారు. బస్సు అద్దాలు పగులగొట్టి, అందులోని ప్రయాణికులను బయటకు తీశారు. బస్సు బోల్తా పడిన ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.