వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల దీవెనలతో అంగరంగ వైభవంగా ఆ జంట వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత నవ దంపతులు తమ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఊహించుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి.. నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన కొత్త జంట రెండు నెలలకే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువ కబలించింది. కాళ్ల పారాణి ఆరకముందే.. ఆ జంట కానరాని లోకాలకు వెళ్లడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
బాపట్లకు చెందిన మిన్నికంటి సిద్దయ్య, పద్మావతి దంపతుల ఇద్దరు సంతానం. కూతురుకి ఆరు నెలల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కుమారుడు పవన్ కుమార్ ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వర్క్ టూ హూం చేస్తున్నాడు పవన్. ఈ క్రమంలో పవన్ పెళ్లి చేయాని తల్లిదండ్రుల ఆలోచించారు.. అనుకున్నదే తడవుగా కళ్యాణి అనే యువతితో వివాహం జరిపించారు. ఈ కొత్త జంటను చూసి ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంతో మురిసిపోయారు.. కానీ వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు.
ఆదివారం రాత్రి పవన్, కళ్యాణి టూ వీలర్ పై బొల్లాపల్లిలో ఒక హూటల్ లో టిఫిన్ చేశారు. తిరిగి ఇంటికి బయలుదేరారు.. యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఒక ప్రైవేట్ వేహికిల్ టూ వీలర్ ని ఢీ కొట్టడంతో దంపతులు అల్లంత దూరం ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. టిఫిన్ చేసి వస్తామని చెప్పి వెళ్లిన కొడుకు, కోడలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ విషాదఘటనతో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.