జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య వివాదం ముదురుతోంది. ‘జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్’ హ్యాష్ ట్యాగ్.. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్క్లబ్ పోసాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఇంట్లో ఆడవారిపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.. అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైనా బుద్ది ఉందా..? నేను నిన్ను అడిగానా నీకు ఎంత మంది పెళ్లాలు ఉన్నారు అని.. ఆడవాళ్ల గురించి గొప్పగా చెప్పే నువ్వు.. పంజాబీ అమ్మాయిని మోసం చేయలేదా.. కడుపు చేయలేదా.. డబ్బులు ఇచ్చి పంపలేదా.. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.