ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ అనే విధానం అమలు అవుతుంది. ఇకపై ఒకే కుటుంబంలో రెండో వ్యక్తికి కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. పేద ప్రజల కొరకు కనీస అవసరాలను తీర్చుకునేందుకు రేషన్ కార్డుగల ప్రతి కుటుంబానికి పెన్షన్ అందిస్తోంది. ఇప్పటికే వృద్ధులు, ఒంటరి మహిళ, వితంతు, దివ్యాంగులు, చేనేత పెన్షన్, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, డప్పు కళాకారులు, హిజ్రాలలు పెన్షన్ పొందుతున్నారు. అయితే తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. త్వరలో రేషన్ కార్డు ఉన్నవారికి రెండో పెన్షన్ కూడా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు పరుచుటకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను వాలంటీర్లు తెలుపుతూ.. అర్హులైన వారి వివరాలను తీసుకుంటారు. రెండో పెన్షన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ అనే విధానం అమలు అవుతుంది. కాగా దివ్యాంగులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. త్వరలో ఒక కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇవ్వడానికి సర్వే నిర్వహిస్తుంది. ఇప్పటికే ‘జగనన్న సురక్ష’ పేరుతో వాలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగానే రెండో పెన్షన్ విషయంపై వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచాం తెలుస్తుంది. కుటుంబంలో ఇదివరకు పెన్షన్ పొందుతున్న వ్యక్తితో పాటు రెండో వ్యక్తి పెన్షన్కు అర్హులను గుర్తిస్తూ.. వాలంటీర్లు వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే ఇందులో వృద్ధులు, ఒంటరి మహిళ, వితంతు, దివ్యాంగులు, చేనేత పెన్షన్, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, డప్పు కళాకారులు, హిజ్రాలలో ఎవరైనా రెండో పెన్షన్కు అర్హులు ఉన్నారా? లేరా? అన్న వివరాలను సేకరిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో 60 ఏళ్లు దాటిన వృద్దులకు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు,ట్రాన్స్జెండర్లు, డప్పుకళాకారులు, ఎయిడ్స్ వ్యాధి బాధితులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులకు నెలవారీ పెన్షన్లు అందుతున్నాయి. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.3వేల చొప్పున పెన్షన్ అందుతుండగా.. వృద్ధులు, ఒంటరి, వితంతు మహిళలకు రూ. 2750 పెన్షన్ అందుతోంది. వచ్చే ఎన్నికల వరకు రూ. 3వేలకు చేరనున్నట్లు సమాచారం.