రాకెట్ యుగంలో ఉన్నా.. నేటికి కూడా మన సమాజంలో ఆడా మగా తేడాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. నేటికి కూడా ఆడపిల్లను చిన్న చూపు చూసేవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో బాలికల విద్య కోసం.. ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా బాలికల విద్య కోసం ఎన్నో స్కాలర్షిప్లు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థినిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థినిలకు స్కాలర్షిప్ అందించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్.. మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. ఇందుకోసం గర్ల్స్ ఎడ్యూకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ (Girls Education Scholarship Test (GEST-2023)) నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీఈఎస్టీ పరీక్షని.. ఈ ఏడాది డిసెంబరు 4న నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలియచేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేస్తామని అన్నారు. ఈ క్రమంలో మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు.. తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. వీరందరికి ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు స్కాలర్షిప్ ఇస్తామని తెలిపారు.
ఈ క్రమంలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న బాలికలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు వెబ్ సైట్-www.ntrtrust.orgలో ఈ నెల 11 నుంచి 30 లోపు(11.11.2022 నుంచి 30.11.2022) నమోదు చేసుకొనవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
కాల్ చేయాల్సిన నెంబర్స్: 7660002627/7660002628.