కుమారుడు అంటే తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుతాడు అనేది చాలా మంది అభిప్రాయం. డబ్బులు కావాలా? అమ్మ కావాలా? అన్ని చిన్నతనంలో అడిగితే అమ్మే కావాలి అనే కొడుకు. పెళ్లైన తరువాత చిన్నతనంలో అమ్మ చేసిన సేవలు మరిచి.. ఆమెను వృద్ధాప్యంలో ఇబ్బదులకు గురి చేస్తున్నారు. తల్లి నీడ పట్టున కూర్చోబెట్టి షోషించాల్సింది పోయి.. ఆమెకు నీలువ నీడ లేకుండా చేస్తున్నారు. తాజాగా ఓ కుమారుడు ఆస్తి లాక్కొని తల్లిని బయటకి గెంటేశాడు. దీంతో తనకు న్యాయం జరగాలని ఆ తల్లి న్యాయపోరాటం చేస్తోంది. ఈఘటన కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆ తల్లి మాట్లాడుతూ..”నా భర్త చనిపోయిన తరువాత తన ఆస్తిని అంత నా కొడుకు లాక్కొని..నన్ను పట్టించుకోకుండా అమెరికా వెళ్లిపోయాడు. గత 10 సంత్సరకాలంగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా నా సమస్యను ఏవరూ పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం జరిగే వరకు నా ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ప్రాణాలైన వదులుతా కానీ నాకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తును.ఎన్ని కేసులు పెట్టినా డబ్బు, రాజకీయ పలుకుబడికితో నా కుమారుడు తప్పించుకుంటున్నాడు. నా కొడుకు అడ్రెస్, ఫోన్ నంబర్ లేకుండా ఎలా తీర్పులు ఇచ్చారు ” అని ఆమె పేర్కొంది. తన నివాసం చుట్టూ పక్కల ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ప్రదేశం లో గోడ కి పోస్టర్లు అంటించిన వైనం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఆ తల్లి ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.