దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముదుసలి వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా మృగాళ్లలో ఎలాంటి మార్పులు రావడం లేదు. విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. బాలిక ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.
ఇది చదవండి : మోడల్ ఆత్మహత్యా యత్నం.. హోటల్ ఆరో అంతస్తు నుంచి
ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. తండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తి ఎంతలా వేధించాడో ఆ బాలిక పుస్తకంలో రాసుకున్న విషయాలు చూస్తే తెలుస్తుందని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా పోటీ చేసిన వ్యక్తి పద్నాలుగేళ్ల బిడ్డను ఇలా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నారీ శక్తి పేరుతో ధర్నాలు చేసేముందు.. తమ పార్టీ వాళ్లు ఏం చేశారో ఆలోచించాలంటూ రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన బాలిక ఇంటి ముందు కూర్చుని సంకల్ప దీక్షలు చేయండని అప్పుడు ఆ కుటుంబం బాధ ఏంటో తెలుస్తుందని అన్నారు.
ఇది చదవండి: ఆ రెండు రాష్ట్రాల్లోనే IPL 2022 మ్యాచ్ లు
ఎవరైనా ఇబ్బంది పెడితే మహిళలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, తప్పు చేసినవాళ్లకు శిక్ష పడేలా చేయాలి కానీ, మీలో మీరే కుమిలిపోయి, డిప్రెషన్లోకి వెళ్లిపోయి, ప్రాణాలు తీసుకోవొద్దని రోజా విజ్ఞప్తి చేశారు. దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ తో పాటు ప్రతి సచివాలయంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండటం వల్ల మహిళలు తమ సమస్యలను వారితో చెప్పుకునేందుకు అవకాశం ఉంది. దిశ యాప్ కు సమాచారమిస్తే పోలీసులే మొత్తం చూసుకుంటారని తెలిపారు. ఎలాంటి ఆపదలో ఉన్నా.. మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.