రాజకీయంగా ఆరోపణలు, విమర్శలు చేసుకున్నప్పటికీ, అభివృద్ధి, సమాజ హితాన్ని కోరే పరంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నేతలు ఒకరినొకరు సాయాన్ని అందించుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషమమై మరోసారి రుజువు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ఆ నేతలపై విమర్శలు చేస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ పరంగా విమర్శలు చేసుకున్నప్పటికీ.. ఈ రెండు ప్రభుత్వాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రాజకీయంగా ఆరోపణలు, విమర్శలు చేసుకున్నప్పటికీ, అభివృద్ధి, సమాజ హితాన్ని కోరే పరంగా ఇరు రాష్ట్రాల నేతలు ఒకరినొకరు సాయాన్ని అందించుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయమే మరోసారి రుజువు అయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇంతకు ఆయనకు.. కేటీఆర్ ఎందుకు, ఏ విషయంలో ధ్యాంక్స్ చెప్పారంటే..?
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లలో పురాతన శ్రీ లక్ష్మీ వెంటేశ్వర స్వామి ఆలయాన్ని, ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో ఉన్న పురాతన శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ పునరుద్ధరణకు మంత్రి కేటీఆర్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ సుబ్బారెడ్డితో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అక్కడ దేవాలయ పునరుద్ధరణ అయితే సుబ్బారెడ్డికి ఏంటీ సంబంధం అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే..? దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా.. కొత్త దేవాలయాలు నిర్మించడం, పాత ఆలయాలను పునర్మించే కార్యక్రమాలు చేపడుతోంది టీటీడీ. ఈ క్రమంలో.. తెలంగాణలో పురాతన ఆలయాల పునరుద్ధరణతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి టీటీడీ తరుపున సాయం అందించేందుకు ముందుకు వచ్చారు సుబ్బారెడ్డి.
ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేవాలయాల గురించి సుబ్బారెడ్డి, జగన్ అన్నలకు నేను ఒక్క రిక్వెస్ట్ చేశా. తిరుమల తిరుపతి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయం. ఆ దేవుడి, ఏపీ ప్రజలు ఆశీస్సులతో మీరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సుబ్బారెడ్డి అన్న టీటీడీ ఛైర్మన్గా ఉన్నారు. మరి ఇక్కడ ఎన్నో పురాతన, ప్రశస్తి కలిగిన దేవాలయాలు.. కొన్ని డబ్బులిచ్చి మనం బాగు చేస్తే ఆ దేవాలయాలు వెలుగొందుతాయని, మీ ఆశీస్సులు ఉండాలని కోరాను. సెకన్ కూడా జగనన్న ఆలోచించకుండా డబ్బులివ్వడమే కాదూ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ అన్నకు, సుబ్బారెడ్డికి ధన్యవాదాలు’అంటూ కేటీఆర్ అన్నారు.
‘ఆనాడు కూడా చెప్పినాం. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా.. కేవలం ప్రాంతాలుగా విడిపోతున్నాం. ప్రజలుగా కలిసే ఉన్నామని. ఈ రోజు గొప్ప ఉదాహరణ సుబ్బారెడ్డి అన్నా ఇక్కడకు వచ్చి ఆశీర్వాదం ఇవ్వడమే. గట్టిగా చప్పట్లతో వారిని మనస్సారా అభినందించాలి. ఎందుకంటే వారికి ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంది. ఒక్క మాట అడగ్గానే ఇక్కదాకా వచ్చి చేశారు. అందుకు ధన్యవాదాలు. పునర్నిర్మిస్తున్న వేణుగోపాల స్వామి ఆలయ ప్రభ తగ్గకుండా ఉండాలంటే మరో రూ.80 లక్షలు కావాలని సుబ్బారెడ్డి అన్నను అడగ్గానే.. క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించారు.’అని చెప్పారు. ‘ ఆయనను ఇంకొ మాట కూడా అడిగా.. ఆ రెండు దేవాలయాలకు డబ్బులిచ్చారు. గంభీరరావుపేటలో సీతారామస్వామి దేవాలయ అభివృద్ధికీ డబ్బులు అడిగా.. తప్పకుండా ఆలోచిస్తాం తారక్’అని చెప్పారు అంటూ కేటీఆర్ తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మరియు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ వై. వి. సుబ్బారెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీ @KTRBRS. pic.twitter.com/q5ih9IYVrs
— BRS Party (@BRSparty) June 14, 2023