ఏపీ రాజకీయాలో గత కొంత కాలంగా వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం సాగుతుంది. ప్రస్తుతం ఏపిలో జిల్లా విభజన హడావుడి మొదలైంది. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. కొత్త జిల్లాలకు వాళ్ళ పేర్లు పెట్టాలి వీళ్ళ పేర్లు పెట్టాలంటూ అనేక డిమాండ్లు వచ్చాయి. అలాగే ప్రాంతాల మార్పు, జిల్లా కేంద్రాల ఏర్పాటు, సరిహద్దుల వివాదాలు కూడా మొదలయ్యాయి.
శనివారం ఏపీ మంత్రి కొడాలి నాని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గుడివాడలోని స్టేడియం దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే కనీసం తెలుగుదేశం పార్టీ అభినందించకపోవడం విచారకరమని మంత్రి కొడాలి నాని అన్నారు.
ఇది కూడా చదవండి: ఆ గ్రామాలకు రైతు బంధు ఆపండి.. కేసీఆర్ సంచలన ఆదేశాలు
జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపైన టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. ఇక టీడీపీ వారు ఎన్టీఆర్ పై ఎంత ధ్వేషంగా ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుందన్నారు. ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టింది చంద్రబాబు కాదా? అని కొడాలి నాని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ చంద్రబాబు చేతులో రాజకీయ సమాధి అవుతుందని కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు. గుడివాడ ప్రజలు చంద్రబాబు ను నమ్మరన్నారు. చంద్రబాబు చీర్ బాయ్స్ వచ్చి గుడివాడలో హడావిడి చేస్తే ప్రజలు పట్టించుకోరన్నారు.