వాదాస్పద వ్యాఖ్యలు, విషయాల్లో జోక్యం చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు నటి కరాటే కళ్యాణి. మొన్నటికి మొన్న తిరుపతికి వెళ్లి.. అక్కడేదో అన్యాయం జరిగిందని మీడియాకెక్కిన ఆమె.. తాజాగా మరో వివాదానికి తెర లేపారు. దానికి కారణమైంది ఎన్టీఆర్ విగ్రహం. 54 అడుగుల పొడవైన శ్రీ కృష్ణ అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం లకారం చెరువులో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి కరాటే కల్యాణి ఈ విషయంపై స్పందిస్తూ విగ్రహావిష్కరణ అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు.
తెలుగు ఇండస్ట్రీలో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్బుతమైన పాత్రలకు ప్రాణంపోసిన మహానటులు ఎన్టీఆర్.. వెండితెరపైనా కాదు.. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చాటుకున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి పేద ప్రజల గుండెల్లో ‘అన్న’గా సుస్థిర స్థానం సంపాదించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీసీ రంగులు వేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీనిపై వెంటనే స్పందించారు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు. టీడీపీ నేతలు బొమ్ములూరుకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహ దిమ్మెకు వైసీపీ రంగులు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు ఉన్న వైసీపీ రంగులు […]
ఏపీ రాజకీయాలో గత కొంత కాలంగా వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం సాగుతుంది. ప్రస్తుతం ఏపిలో జిల్లా విభజన హడావుడి మొదలైంది. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. కొత్త జిల్లాలకు వాళ్ళ పేర్లు పెట్టాలి వీళ్ళ పేర్లు పెట్టాలంటూ అనేక డిమాండ్లు వచ్చాయి. అలాగే ప్రాంతాల మార్పు, జిల్లా కేంద్రాల ఏర్పాటు, సరిహద్దుల వివాదాలు కూడా మొదలయ్యాయి. శనివారం ఏపీ మంత్రి కొడాలి నాని […]
ఖమ్మం- విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భారీ విగ్రహం ఖమ్మంలో కొలువుదీరుతోంది. పట్టణంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ కృష్ణావతార రూప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని 2 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిజామాబాద్లో ప్రత్యేకంగా […]