ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023-24 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలానే ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు నూతన గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రతిపక్షాల ఆందోళన మధ్య రెండవ రోజు కూడా వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అలానే నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరి.. మంత్రి ఎన్ని కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గురువారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తారులు చేపట్టారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలను స్పీకర్ కు అందజేశారు. అయితే టీడీపీ సభ్యలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరష్కరించారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023- 24 వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో 2023-24 వార్షిక బడ్జెట్ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు.
ఇక ఈ బడ్జెట్ లో వ్యవసాయసానికి రూ.11,589 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1, 787 కోట్లు కేటాయించారు. అలానే బీసీ సంక్షేమానికి రూ.23,509 కోట్లు, పర్యావరణానికి రూ.685 కోట్లు ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లను కేటాయించారు. జీడీఏకీ రూ.1,418 కోట్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,858 కోట్లు కేటాయించారు. ఇక ప్రధానమైన వైద్య, ఆరోగ్యశాఖకు రూ.15,882 కోట్లు కేటాయించారు. ఇక పలు రంగాలు, ఏపీ ప్రభుత్వం నిధులను కేటాయించింది. అయితే బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. స్పీకర్ చాలా సమయంలో పాటు వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని సీఎం.. స్పీకర్ తమినేని సీతారాంకు సిఫార్సు చేశారు. సభకు అంతరాయం కలిగిస్తున్న టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇక వ్యవసాయాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలానే వ్యవసాయ బడ్జెట్ను మంత్రి సిదిరి అప్పలరాజు మండలి ముందు ఉంచనున్నారు. మరి..ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.