ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023-24 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలానే ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2022-23 వార్షిక సంవత్సరానికి గానూ 2,56,256 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందింది. రెవెన్యూ వ్యయం రూ. 2,08, 261 కోట్లు..మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు.. రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు.. ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా ఉంది. నవరత్నాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం ఈ బడ్జెట్ను తయారు చేసింది. వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ. 18 వేల […]