Prakasam: చనిపోయిన వ్యక్తి తిరిగి రావటం అన్నది అసాధ్యం. అలాంటివి సినిమాల్లోనే జరుగుతుంటాయి. కానీ, నిజ జీవితంలో అలాంటి సంఘటన జరిగితే ఎలా ఉంటుంది. నమ్మడానికి టైం పడుతుంది. మతి పోతుంది కూడా! తాజాగా చనిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగొచ్చాడు. చనిపోయిన 41 రోజులకు ఇంటికెళ్లి.. అందర్నీ ఆశ్చర్యంతో పాటు, భయభ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండంలోని ముండ్లపాడుకు చెందిన పఠాన్ సైదుమియా గతంలో ఆర్మీలో పని చేసేవాడు. మద్యానికి బానిసవ్వటం కారణంగా ఆర్మీ ఉద్యోగం వదిలేశాడు.
లారీ క్లీనర్గా పొట్టపోసుకుంటున్నాడు. అతడికి భార్య రహ్మత్బీ, ఓ కూతురు ఉన్నారు. సైదుమిమా తరుచూ భార్యతో గొడవపడుతుండటంతో ఆమె కూతురితో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి అతడు ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరివాడైన సైదుమియా క్యాంపుకు వెళితే 2,3 నెలలు ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ నేపథ్యంలోనే 41 రోజుల క్రితం మార్కాపురం రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి మృతి చెందాడని సోషల్ మీడియా ద్వారా సైదుమియా బంధువులకు తెలిసింది. మృతి చెందింది సైదుమియానే అని భావించిన బంధువులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు.
భార్య రహ్మత్బీని పిలిపించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, తాజాగా సైదుమియా ఇంటికి చేరుకున్నాడు. అతడ్ని చూసిన గ్రామస్తులతో పాటు, బంధువులు కూడా ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతికొచ్చాడని అనుకున్నారు. అప్పుడు సైదుమియా స్పందిస్తూ.. తాను చావలేదని, 3 నెలలుగా క్యాంపులో ఉన్నానని చెప్పాడు. గ్రామంలో జరిగే పీర్ల పండుగకు వచ్చానని పేర్కొన్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Loan Apps: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు తప్పని లోన్ యాప్ వేధింపులు!