రాకెట్ యుంగంలో కూడా మూఢనమ్మకాలు బలంగా విస్తరిస్తున్నాయి. చేతబడి, నరబలి ఇవ్వడం వంటి అనాగరిక చర్యల గురించి వార్తలను వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు, ప్రజా చైతన్య సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన.. జనాలను ఈ మూఢత్వం నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మీలో చాలామంది ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాను చూసే ఉంటారు కదా. ఆ సినిమాలో కమెడియన్ బాబు మోహన్ తనకు ఉన్న శోభన గండం పోయేందుకు ఓ గాడిద మెడలో తాళి కడతాడు. అచ్చం ఇలానే కృష్ణా జిల్లాలో.. ఓ యువకుడు కూడా మేకను పెళ్లి చేసుకున్నాడు.
నూజివీడు పట్టణానికి చెందిన ఓ యువకుడికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ముందుగా ఓసారి జోతిష్యుడిని అడిగి తెలుసుకుందామని.. ఆయనను సంప్రదించారు. ఆ యువకుడి జాతకం పరిశీలించిన జోతిష్యుడు.. అతని జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పారు. ఈ విషయం తెలిస్తే ఎవరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రారని.. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమని యువకుడి తల్లిదండ్రులు, జోతిష్యుడిని కోరారు.
ఇది కూడా చదవండి: గర్ల్ఫ్రెండ్ కోసం ఆటో డ్రైవర్గా.. 74 ఏళ్ల వయసులో ఎందుకిలా?..
అందుకు ఆ జోతిష్యుడు.. మొదట ఏదైనా జంతువును పెళ్లి చేసుకుంటే, రెండోసారి పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని సూచించడంతో.. కుటుంబసభ్యులు మేకను సిద్ధం చేసి యువకుడితో వివాహ తంతు పూర్తిచేశారు. నూజివీడులోని నవగ్రహ ఆలయంలో మేక మెడలో యువకుడు మూడు ముళ్లు వేశాడు. ఉగాది పండుగ రోజు శాస్త్రోక్తంగా ఈ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేకతో పెళ్లి ఏంటి రా నాయనా.. మేకకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటావా.. మీరు మారరా ఇక అంటూ.. కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.