కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయలపై అవగాహన ఉన్న వారికి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. ప్రజాశాంతి పార్టీని స్థాపించి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. తనదైన రాజకీయాలతో నిత్యం నవ్వుల పువ్వులు పూయిస్తుంటాడని కొందరి అభిప్రాయం. ఎన్నికల ప్రచారం కూడా కేఏ పాల్ అందరికి భిన్నంగా చేస్తుంటారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలే అందుకు నిదర్శనం. సైకిల్ తొక్కుతూ, పొలంలో పత్తిని తీస్తూ, పిల్లలతో డ్యాన్స్ లు చేస్తూ తనదైన శైలిలో ఎన్నిక ప్రచారం చేశారు. అలానే ఇతర పార్టీలకు చెందిన నేతలపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తానుంటున్నారు. అలానే తనపై విమర్శలు చేస్తూ నేతలపై తనదైన శైలీలో కేఏ పాల్ విరుచక పడుతున్నారు. తనను జోకర్ అంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోదీలపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించాడు. అలానే ఏపీ రాజకీయ నేతలపై కూడా తనదైన శైలీలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై ఎందుకు అనవసరంగా విమర్శలు చేస్తారంటూ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.