వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. షూటింగ్స్కు బ్రేక్ చెప్పి ఆయన వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. షూటింగ్స్కు బ్రేక్ చెప్పి ఆయన వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు. యువతను మేల్కోలిపేలా వ్యాఖ్యలు చేస్తూ ర్యాలీని చేపడుతున్నారు. గతంలో కంటే వ్యూహాత్మకంగా, ఆలోచనలతో కూడిన వాగ్భాణాలను సంధిస్తున్నారు. కాకినాడ జిల్లా కత్తిపూడిలో వారాహి విజయ యాత్రను మొదలు పెట్టిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం అమలా పురంలో కొనసాగుతుంది. ర్యాలీలో పెద్ద స్టార్ల గురించి మాట్లాడుతూ.. వారి అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
కాకినాడ, అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్ముడి వరంలో ఆయన మాట్లాడుతూ హీరోల ప్రస్తావన తెచ్చారు. తనకు అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి ఇష్టమని..తామంతా కలిస్తేనే చిత్రపరిశ్రమ అని చెప్పారు. మీరంతా ఏ హీరోనైనా అభిమానించాలని,రాష్ట్ర ప్రయోజనాల కోసం ముక్తకంఠంతో ఆలోచించండి అని సూచించారు. అలాగే జనసేనకు అండగా నిలబడి, భవిష్యత్తు కోసం అడుగువేయాలంటూ పవన్ కోరారు. అలాగే ముమ్ముడి వరంలో ప్రసంగిస్తూ..‘మీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు గొడవ పడుతున్నారు అని అగ్నికుల క్షత్రియులు నాకు చెప్తున్నారు. సినిమా అనేది వినోదం, ఆనందం. నాకు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ..అందరి మీద నాకు గౌరవం ఉంది. వాళ్లందరూ నాకు ఇష్టం. వాళ్ల సినిమాలు నేను చూస్తాను. కనిపిస్తే మాట్లాడుకుంటాం. సినిమాల పరంగా మీ హీరోల మీద ఉన్న ఇష్టం రాజకీయాల్లో చూపించకండి. రాజకీయం వేరు’ అని అన్నారు.
అలాగే ‘ప్రభాస్ నాకంటే పెద్ద హీరో. మహేష్ నాకంటే పెద్ద హీరో. నాకేమీ అలాంటి ఇగోలు లేవు. వాళ్లు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోలు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. వాళ్ల గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. నేను తెలీదు ప్రపంచ వ్యాప్తంగా. నాకు అలాంటి ఇగోలు ఏమీ లేవు’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో ఆయనకు ఎన్టీఆర్ అభిమానుల నుండి భారీ మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ‘NTR Trends’ అనే ట్విట్టర్ పేజ్ నుంచి ఎన్టీఆర్ అభిమానులకు సూచనలు వెళ్లాయి. ఎన్టీఆర్ అభిమానులు, జనసేనాని ఫాలోవర్లు దయచేసి ఫ్యాన్ వార్స్ ఆపాలని.. ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ గొడవ పడొద్దని ఈ పేజ్ నుంచి సూచించారు. ఆయన గొప్ప రాజకీయ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా జన సేనను ఫాలో అవుతున్న సంఖ్య పెరుగుతుంది.
All @tarak9999 Anna Fans & Janasenani Followers, Please Stop These Fanwars In Both Online & Offline. As Kalyan Garu Said, Films & Politics Are Totally Different. Let’s Not Create Any Obstacles In His Great Political Journey.
All The Best @PawanKalyan Sir 💙 https://t.co/tuwguPZS7F pic.twitter.com/CeogDslIfJ
— NTR Trends (@NTRFanTrends) June 21, 2023