పవన్ కల్యాణ్.. రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాలు, సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగిపోతోంది. మార్చి 14న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ గురించే ఇంకా చర్చోపచర్చలు నడుస్తూ ఉన్నాయి. సభలో పవన్ చేసిన ప్రసంగం, అక్కడికి వచ్చిన అశేష అభిమానగణం ఈ విషయాలే వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ సభ జరిగిన ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది.
ఇదీ చదవండి: OTTలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆ గ్రామస్థులు మొత్తం పవన్ కల్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎందుకంటే ఆ గ్రామాభివృద్ధికి జనసేన ట్రస్టు నుంచి రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయంపై పవన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆ గ్రామస్థులు పాలాభిషేకం చేశారు. తమ గ్రామం పేరును రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. తమ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— K I N G (@KingKalyanPK) March 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.