కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు 2 గ్రామ సచివాలయం మూతపడింది. అద్దె చెల్లించలేదని యజమాని తాళం వేశారు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు చేసేదేమీ లేక ఆ సచివాలయం బయటే కుర్చీలేసుకుని కూర్చున్నారు. గత ఆరు నెలలుగా అద్దె చెల్లించాలని ఎంతగా అడుగుతున్నా.. అధికారుల్లో ఏ మాత్రం మార్పు లేకపోవడం విసుగెత్తిన ఇంటి ఓనర్ ఏకంగా గ్రామ సచివాలయానికే తాళం వేశాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు 2 గ్రామ సచివాలయం అద్దె భవనంలో నడుస్తోంది.
సచివాలం కి రావడం పనులు చూసుకొని వెళ్లడం వరకే అధికారుల పనితీరు కొనసాగుతుందని.. గత ఆరు నెలలుగా సచివాలయ భవనానికి చెల్లించాల్సిన అద్దె డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంతో ఈ రోజు ఉదయం తాళాలు వేసినట్లు యజమాని తెలిపారు. ఇక గ్రామ సచివాలయానికే తాళం వేయడంతో చేసేదేమీ లేక లేక బయటే కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. గతంలోనూ అనేకసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయాలకు తాళాలు వేశారు. అద్దె చెల్లిండం లేదని ఒకరు.. కాంట్రాక్ట్ బిల్లులు ఇంకా చెల్లించడం లేదని ఇంకొకరు ఇలా పలుమార్లు గ్రామ సచివాలయాలకు తాళాలు వేశారు.
ఇది చదవండి : నాన్న చనిపోతే వచ్చిన డబ్బుతో డ్రమ్స్ కొన్నాను: తమన్
గతంలో ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంభొట్లవారిపాలెంలో గ్రామ సచివాలయానికి.. ఆ భవన యజమాని తాళం వేశారు. సచివాలయానికి ఇంటిని అద్దెకు ఇవ్వగా.. 13 నెలలుగా ఎలాంటి అద్దె చెల్లించకపోవడంతో సచివాలయానికి ఆ ఇంటి యజమాని తాళం వేసినట్లు యజమాని అన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మే 20వ తేదీ 2020వ సంవత్సరంలో కర్నూలు జిల్లా ఎమ్మగనూరు మసీదుపురం గ్రామంలోని గ్రామ సచివాలయానికి అద్దె చెల్లించలేదన్న కారణంతో తాళం వేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.