తెలుగు రాష్ట్రాల్లో అనుకోని వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు చోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన రావడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురియడంతో రైతులకు భారీగా పంటనష్టం వాటిల్లి లబో దిబో అంటున్నారు. రానున్న రెండు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉందని.. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
ఏపీలో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చించింది. పశ్చిమ ద్రోణి బీహార్ నుంచి ఛత్తీస గఢ్, విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు పయణించే అవకాశాలు ఉన్నాయని.. వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయల సీమలో పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు తెలిపారు. 17, 18, 19 న శ్రీకాకుళం, విశాఖ, తూర్పూ గోదావరి, అల్లూరి సీతారామరాజు, కర్నూల్, వైఎస్సార్, తిరుపతి పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చిరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తుంది.
పలు జిల్లాల్లో భయంకరంగా ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని.. రాష్ట్ర విపత్తులు ఎండీ డా బీఆర్ అండేద్కర్ తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వడగండ్ల వానలు, పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాని.. రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.