ఇప్పుడు ప్రపంచం టెక్నాలజీ పరంగో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయ్యింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలోని విశేషాలన్నీ మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగస్తులు ఆఫీస్ కి వచ్చారంటే రిజిస్ట్రర్ లో సంతకాలు చేసేవారు.. కానీ ఇప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిస్టమ్స్ లో కొన్నిసార్లు ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా ఓ ఉపాధ్యాయుడు ఫేసియల్ రికగ్నేషన్ యాప్ తెచ్చిన తంటాతో ఏకంగా తన ఉద్యోగాన్నే పోగొట్టుకోవాల్సి వచ్చిన ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా దైవ దర్శనానికి వెళ్లి తమ మొక్కులు చెల్లించుకొని తలనీనాలు దేవుడికి సమర్పిస్తారు. తమ కష్టాలు పోవాలని.. తమ కుటుంబం చల్లగా ఉండాలని దేవున్ని కోరుకుంటాం. అలాగా హిందూపురం పట్టానికి చెందిన ఆదినారాయణ ఉపాధ్యాయుడు గత నెల 5న పావగడశనేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని గుండు గీయించుకొని మొక్కులు చెల్లించుకున్నాడు. ఆదినారాయణ విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చి ఫేసియల్ యాప్ లో హాజర్ వేయబోయాడు. కానీ.. ఆ ఫేసియల్ యాప్ ఆదినారాయణ ముఖం రికగ్నేషన్ చేయకపోవడంతో మరోసారి ప్రయత్నించాడు.. కానీ అదే రిజల్ట్ ఇది నీ ఫేస్ కాదు అన్నట్లు రిజక్ట్ చేస్తుంది.
టీచర్ ఆదినారాయణ ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తాను విధులకు హాజరైనప్పటికీ.. ఫేసియల్ యాప్ రికగ్నేషన్ చేయడం లేదని మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పలు కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం పై ప్రభుత్వాధికారులు విచారణ చేపట్టారు.. సమస్యలు ఏవైనా ఉంటే తమకు చెప్పాలే కానీ.. మీడియా దృష్టికి తీసుకు వెళ్లి టాం టాం చేయడం ఏంటని ఆదిరానారణకు ఈనెల 17 న మెమో ఇష్యూ చేశారు.
ఈ విషయంపై ఆదినారాయణ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు డీఈఓ మీనాక్షి. ఇదిలా ఉంటే టెక్నాలజీ సిస్టమ్ లో తేడాలు సరి చేయకుండా.. ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వ్యక్తిని సస్పెండ్ చేయడం ఏంటని ఉద్యోగసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.