ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సీఎం జగన్ వాటిని అట్టడుగు వర్గం వారికి ఆర్థిక సాయంగా అందిస్తున్నారు. వాటిలో భాగంగా బడికి వెళ్లే విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదివించే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. జగనన్న అమ్మఒడి పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం నిధులను ఈ నెల 28న నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిణీ చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్లలో నగదు జమ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
2022-23 సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్లలో నగదు జమ కానుంది. కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. నెలకు కరెంట్ 300 లోపు యూనిట్లు ఉన్న వారికి.. టాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహా ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండని వారికి ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థులకు తప్పనిసరి
75 శాతం హాజరు ఉండాలి. లేనిచో ఈ పథకం వర్తించదు. మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. ఈ పథకం కింద ఇచ్చే రూ.15 వేలలో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ. 2వేలు మినహాయిస్తూ.. మిగతా రూ. 13వేలు తల్లుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు.అర్హతలు కలిగిన విద్యార్థులు వివరాలను ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ స్కీం వర్తిస్తుంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సీఎం జగన్ వాటిని అట్టడుగు వర్గం వారికి ఆర్థిక సాయంగా అందిస్తున్నారు. వాటిలో భాగంగా బడికి వెళ్లే విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదివించే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. పేద కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ. 15వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్కి వెళ్లే విద్యార్థులకు నాడు నేడు పథకం కింద కూడా విప్లవాత్మక మార్పులు చేశారు. డిజిటల్ క్లాస్ రూం లు అమలులోకి తెచ్చి.. పిల్లలకు చదువు విషయంలో అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. పాఠశాలలను సందర్శించినపుడు.. ఏదైనా కార్యక్రమాల్లో విద్యార్థులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువే నిజమైన ఆస్తి.. మనిషి తలరాతను మార్చేది చదువేనని.. పేదరికాన్ని రూపుమాపడానికి చదువు తోడ్పడుతుందని విద్యార్థులను ప్రోత్సహిస్తారు.