ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సీఎం జగన్ వాటిని అట్టడుగు వర్గం వారికి ఆర్థిక సాయంగా అందిస్తున్నారు. వాటిలో భాగంగా బడికి వెళ్లే విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదివించే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.