ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుండి వర్క్షాప్ నిర్వహించనుంది. దీనిద్వారా 11 రకాల సర్వీసులు అందించనున్నారు. జులై 1 నుండి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నారు.
ఏపీ వాసులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని గ్రామాల నుండి అమలు పరుచడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుండి వర్క్షాప్ నిర్వహించనుంది. దీనిద్వారా 11 రకాల సర్వీసులు అందించనున్నారు. జులై 1 నుండి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆ క్యాంపు నాలుగు వారాలపాటు ఏర్పాటు చేసి పలు సేవలు, ధృవీకరణ పత్రాలు ఇష్యూ చేయనున్నారు. వీటికి ఎలాంటి ఛార్జీలు చెల్లించేపనిలేదు. ఈ కార్రక్రమాన్ని ప్రజలకు అవగాహన కోసం ఈనెల 24 నుండి ప్రతి ఇంటికి వెళ్ళి.. పలు పథకాల గురించి వివరాలను తెలియపరుస్తారు.
మండలాల వారీగా ఎంపీడీవో, తహసీల్దార్ల నేతృత్వంలో రెండు టీమ్లను ఏర్పాటు చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు. ఈ క్యాంపు సూపర్ వైజింగ్ కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులు ఉంటారు. వీరిని జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. ఏ సచివాలయంలో క్యాంపు నిర్వహించే విషయాన్ని ఒకరోజు ముందే సమాచారం అందించేలా ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాప్లో పాల్గొనే సిబ్బంది, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రతి సచివాలయం దగ్గర నిర్వహించే క్యాంపుల్లో 11 రకాల సర్వీసులకు ఎలాంటి చార్జీలు పే చేయక్కర్లేదు. మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. మిగతా వాటికి చార్జీలు చెల్లింపులు లేవు. వాటి వివరాలు:
ఆదాయ ధ్రువీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు(కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు), మరణ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విఢభజన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్, కౌలు గుర్తింపు కార్డులు(సీసీఆర్సీ), వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు), ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంతమంది సభ్యుల పేర్ల తొలగింపు.. మొదలైన సేవలు అందిస్తారు.
మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే.. భూమి కొనుగోలు చేసిన తర్వాత ఆన్లైన్లో భూమి వివరాల నమోదులో మార్పులు, చేర్పులు ఉంటాయి. ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజల వినతులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం తోడ్పడుతుంది.