నేటి సమాజంలో ఎవరి లైఫ్ వారిదే అన్నట్టుగా సాగిపోతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నవారిని ఎంతోమంది చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రం తాము చనిపోతూ పదిమందిని బతికిస్తున్నారు.
ప్రస్తుతం సమాజంలో ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారిని చూసీ చూడనట్టు వెళ్లిపోతుంటారు. అలాంటి సమాజంలో కొంతమంది ప్రాణాలు పోయినా.. పదిమంది జీవితాల్లో వెలుగునిస్తుంటారు. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకొని అవయవదానం చేయడానికి ముందుకు రావడం.. పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకుంటున్న సందర్భాలు ఈ మద్య కాలంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ మహిళ తాను చనిపోయి నలుగురు ప్రాణాలు కాపాడింది.. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఓ వ్యక్తి చనిపోతే వారిని పూడ్చమో.. కాల్చడమో చేస్తుంటారు.. కానీ చాలా తక్కువ మంది వారి అవయవాలను ఆపదలో ఉన్నవారికి దానం చేసి ప్రాణాలు నిలిచేలా చేస్తుంటారు. తాము అభిమానించే వ్యక్తి చనిపోయి.. గుండె నిర్భరం చేసుకొని మృతి చెందిన వారి అవయవదానాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. సాధారణంగా చనిపోయిన వారి నుంచి సకాలంలో కిడ్నీలు, గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, బ్రెయిన్ ఇలా అన్ని ఆర్గాన్స్ దానం చేసి.. అవసరాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఇంతక ముందు అయితే అవయవదానం చెయ్యాలంటే అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆ కోవకు చెందిన ఓ మహిళ ముందుకు వచ్చి గొప్ప మనసును చాటుకుంది. తాజాగా ఈ ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుకుంది.
శ్రీకాకుళం జిల్లా మధుపం కు చెందిన పట్నాన చంద్రకళ(30)కు కొంతకాలం క్రితం వివాహం అయ్యింది. భార్యభర్తలిద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇటీవల చంద్రకుళకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. దీంతో ఆమెను ఆసుపత్రికి వెళ్లి చూపించగా చంద్రకళకు బ్రెయిన్ డెడ్ అని చెప్పారు వైద్యులు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం విశాఖ విమ్స్ కి తరలించారు. అక్కడ కొన్ని రోజులు నుంచి చికిత్సా పొందుతూ ఉంది. చంద్రకళకు నాలుగు రోజుల నుంచి పూర్తిగా ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. కుటుంబసభ్యులు పుట్టెడు దుఖఃంలో మునిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో విమ్స్ ఆసుపత్రి వాళ్లు జీవన్ ధాన్ ప్రాముఖ్యత గురించి చంద్రకళ కుటుంబ సభ్యులకు.. ముఖ్యంగా ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయవదానానికి సిద్దపడేటట్లు విమ్స్ డైరెక్టర్ రాంబాబు ప్రత్యేకంగా శ్రద్ద తీసుకున్నారు.
చంద్రకళ చనిపోయిన బాధతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నప్పటికీ.. డాక్టర్లు చెప్పిన అవయవదానం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగు నింపవొచ్చు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె అవయవదానం చేయడానికి ముందు వచ్చారు. దీంతో తొలిసారిగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవదానానికి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నియమ నిబంధన ల ప్రకారం చంద్రకళ మృతదేహాం నుంచి రెండు కిడ్నీలు, కార్నియాలను సేకరించారు. అంతేకాకుండా అవయవదానం చేసిన మహిళకు ప్రత్యేక గౌరవం ఇచ్చి, పూల వర్షం కురిపించారు. ఆ తర్వాత మృతదేహానికి ఆసుపత్రిలో ప్రత్యేక నివాళులు అర్పించారు.
చంద్రకళ కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని అందజేసారు విమ్స్ డైరెక్టర్ రాంబాబు. ఈ క్రమంలోనే ఏపీలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవదానం జరిగింది. కావున ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ల అవయవాలతో 8 మందికి ప్రాణం పోయవచ్చిని అంటున్నారు. విమ్స్ డైరెక్టర్. అలాగే అవయవ దానం పై అవగాహాన కల్పించాలి. అపోహాలు మూఢనమ్మకాలు మానుకోవాలని డాక్టర్ రాంబాబు తెలియజేసాడు. మరణించి బతుకుతున్న ఆ మహిళకు మా ధన్యవాదాలు.. ఆ కుటుంబంలో పుట్టెడు దు:ఖంలోను ఉంటూ నలుగురి జీవితాల్లో వెలుగు నింపేందుకు ముందుకు వచ్చారని ఆకుటుంబానికి సెల్యూట్ చేయాల్సిందే అని విమ్స్ డాక్టర్ లు తెలిపారు.