ఈమధ్య కాలంలో కొన్ని మీడియా సంస్థలు, న్యూస్ వెబ్సైట్లు కొందరు నేతల గురించి కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. వారు అనని స్టేట్మెంట్లను.. సదరు నాయకుల పేరు మీద ప్రచారం చేస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ఇలాంటి తప్పుడు వార్త ఒకటి ప్రచారం అవుతుంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి సోమవారం ఒక వార్త తెగ వైరలయ్యింది. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తామని చింత్రమేని వార్నింగ్ ఇచ్చినట్లు ఒక వార్త మీడియాలో వైరలయ్యింది. అయితే అవన్ని అవాస్తవాలని.. తప్పుడు ప్రచారాలని తెలిసింది. కావాలనే చింతమనేనిపై కొందరు తప్పుడు ప్రచారానికి దిగారని స్పష్టత వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్.. తాము అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేస్తామని అన్నట్లు ప్రచారం జరిగింది.
‘‘కూల్చడం తప్ప కట్టడం తెలియని రాక్షస ప్రభుత్వానికి వార్నింగ్. వచ్చే ఎన్నికల్లో మేం గెలిచి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలు కూల్చివేస్తాము. వచ్చే ఎన్నికల్లో మేం 160 స్థానాల్లో గెలుస్తాం’’ అని చింతమనేని అన్నట్లుగా మీడియాలో ప్రచారం అయ్యింది. అయితే అవి తప్పుడు వార్తలని.. చింతమనేని ఎక్కడా వైఎస్సార్ విగ్రహాలు కూల్చివేస్తామని ప్రకటన చేయలేదని స్పష్టత వచ్చింది. ఎవరో కావాలనే చింతమనేని పేరిట తప్పుడు ప్రచారరానికి పాల్పడ్డట్లు తెలిసింది.