కోటిన్నర అప్పు కుటుంబాన్ని కబలించింది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడు రూ. కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా భార్యను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. దీంతో సదరు వ్యక్తులు అప్పు తీర్చాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశారు. అప్పుల వాళ్లు ఇంట్లో ఉన్న వారిని అప్పు తీర్చాలని ఒత్తిడి చేశారు. అవమానం భరించలేక ఆ కుటుంబం ఓ దారుణ నిర్ణయాన్ని నిర్ణయాన్ని తీసుకుంది. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాచపాలెం గ్రామంలో శంకరయ్య గురువమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి సతీష్, వినయ్ సంతానం. పెద్ద కుమారుడు సతీష్ తనకు పరిచయం ఉన్న వారి వద్ద నుంచి అప్పులు చేశారు. దాదాపు కోటిన్నర పైగా అప్పు చేసి ఇంటి నుంచి పారిపోయాడు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తాము ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ అప్పు తలకుమించిన భారం కావడం, అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తుండడంతో మనస్థాపానికి గురైయ్యారు. తమ పరువు పోయినట్లు బావించారు. దీంతో శంకరయ్య. గురువమ్మ వారి చిన్నకుమారుడు వినయ్ దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న పెద్దకుమారుడు సతీష్ కోసం ఆరా తీస్తున్నారు. అతడు ఎక్కడైనా ఉన్నాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా గడిపిన కుటుంబంలో అప్పులు తెచ్చిన తిప్పలు ముగ్గురు ప్రాణాలను బలిగొన్నాయి. నిన్నటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం విషాదాంతమవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.