ఏపీలోని నర్సిపట్నంలో వైద్యులు గొప్ప మనసును చాటుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏకంగా సెల్ ఫోన్ లైట్ల వెలుగులతోనే ఓ నిండు గర్భిణీకి డెలవరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. అయితే నర్సిపట్నం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోకి ఓ గర్బిణి డెలవరీ కోసం వెళ్లింది. కాగా ఓ వైపు కరెంట్ లేకపోవడం మరో పక్క ఆస్పత్రి జనరేటర్ పనిచేయకపోవడంతో ఏం చేయాలో తెలియక వైద్యులు సెల్ ఫోన్ లైట్లతోనే ఆ మహిళకు డెలవరీ చేశారు.
ఇది కూడా చదవండి: సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంకలా అవుతుందా? : సీఎం జగన్
ప్రస్తుతం మహిళతో పాటు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. వైద్య సిబ్బంది చేసిన ఈ పనికి పలువురు మెచ్చుకుంటుంటే మరికొందరు విద్యుత్ కొరతపై ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ కోతలపై ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూడాలి మరి.
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు. ఓ వైపు విద్యుత్ కోతలు, మరోవైపు జనరేటర్ పనిచేయక పోవడంతో మొబైల్ లైట్ల వెలుగులో నిండు గర్భిణీకి డెలివరీ చేసిన సిబ్బంది.#AndhraPradesh #Visakhapatnam #Narsipatnam #Vizag pic.twitter.com/Xq2MIn2WL1
— Vizag News Man (@VizagNewsman) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.