విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యారు. గాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచి ప్రతిభ చాటుకున్నారు. పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యువతులు హాజరయ్యారు. అందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా విజేతగా నిలిచారు.
ఛరిష్మా కృష్ణ ఏయూలో ఫైన్ఆర్ట్స్ కోర్సు చదువుతూనేనటనలో, మోడల్గా, నృత్య కళాకారిణిగా రాణిస్తూ.. ప్రముఖలచే ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా, ఈ పోటీలో తమిళనాడుకు చెందిన దేబ్నితా కర్ ఫస్ట్ రన్నరప్గా నిలవగా, కర్ణాటకకు చెందిన సమృద్ధి శెట్టి రెండో రన్నరప్గా నిలిచింది. మిస్ సౌత్ ఇండియా ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఛరిష్మా అంటున్నారు. విశాఖ కు చెందిన ఛరిష్మాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి… అందుకే చిన్ననాటి నుంచి క్లాసిక్, ఫోక్, వెస్టన్ డ్యాన్స్ లు నేర్చుకుంటూ వస్తుంది.
ఛరిష్మా ఇప్పటి వరకు 30 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. స్విమ్మింగ్, గుర్రపుస్వారీలోనూ శిక్షణ పొందారు. స్టార్మేకర్గా గుర్తింపు పొందిన ఎల్.సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆమె తండ్రి హరికృష్ణ అమెరికాలో పీహెచ్డీ చేశారు. ఐదవ తరగతి వరకు అమెరికాలోనే చదివింది. ఆ తరువాత వీరి కుటుంబం విశాఖ వచ్చింది. ఛరిష్మా రహదారి భద్రతపై సందేశానిచ్చే ‘10,456 డేస్ అండ్ డ్రీమ్స్’ అనే లఘుచిత్రంలో నటించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.