ఏపి రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు రక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేశ్ లపై తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. అంతే కాదు లోకేశ్ కు దమ్ముంటే గుడివాడలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. 15 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును జగన్ ఒక్క మాట కూడా తులాలేదన్నారు.
ఇది చదవండి : అసెంబ్లీలో తాళి బొట్లతో టీడీపీ సభ్యుల నిరసన!
ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జోక్యం సరికాదని, అసెంబ్లీకి చట్టం చేసే హక్కు ఉందని సీఎం జగన్ గ సభలో చెప్పారే కానీ ఎక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదన్నారు. నారా లోకేష్ అమెరికాలో చదువుకున్నాడని కూడా తానే చెప్పారు. తాను టెన్త్ నాలుగు సార్లు తప్పానని కూడా తానే చెప్పుకున్నారు. చదువులో తనది … లోకేష్ కంటే ఎంతో తక్కువ అని… తనపై పోటీ చేసి గెలవాలనిలోకేష్కు సవాల్ కి సవాల్ విసిరారు కొడాలి నాని. ప్రతిసారి సీఎం జగన్ చదువు విషయం గురించి మాట్లాడే లోకేశ్ అమెరికాల చదవి ఏం ఉద్దరించారని ఎద్దేవా చేశారు.
ఇది చదవండి : పాములు పగబడతాయా.. నిజమెంత?
శాసనసభకు చట్టాలు చేసే అన్ని అధికారాలు ఉన్నాయన్న కొడాలి నాని… శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదనడం సరికాదన్నారు. తెదేపాను డిఫాల్టర్ల పార్టీగా మార్చారని దుయ్యబట్టారు. సీఎం జగన్ తప్పకుండా విశాఖ వెళ్లి పరిపాలన సాగిస్తారన్నారు. తెదేపా జాతీయ పార్టీ కాదన్న కొడాలి నాని, తెదేపా జాతీయ పార్టీ అని కేంద్ర ఎన్నికల సంఘం చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. లోకేశ్ లాగా సీఎం జగన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదన్నారు. తాత, తండ్రి ముఖ్యమంత్రులు అని డప్పు కొట్టుకోలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి లోకేశ్ అని విమర్శించారు.