ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అనేక సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్న వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ చేస్తూ ప్రైవేట్ గా ప్రాక్టీస్ నిర్వహించే వారిపై కొరడా ఝలిపించారు. ఇక ముందు ఇలాంటివి ఎక్కడా కనిపించకూడదని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు త్వరగా రూపొందించాలని పేర్కొంది.
ఇటీవల కొంత మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు నిర్వహింస్తూ డబ్బు సంపాదించడం పైనే దృష్టి పెట్టడంతో ఎంతో మంది రోగులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పష్టమైన నియమ, నిబంధనలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగు పరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్ కి ధీటుగా తయారు చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆసుపత్రిలో సిబ్బంది కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. కానీ కొంత మంది వైద్యులు స్వలాభం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన సేవలు అందిస్తున్నారనే భావనలో ప్రజలు ఉన్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.