మొన్నటి వరకు సరైన గిట్టుబాటు ధర లేదని రోడ్లపై పడవేసిన టమాటా ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. రూ.10 లకు పలికే టామాటా ఇప్పుడు ఏకంగా రూ.100 లకు పైనే పలుకుతుంది.
ఇటీవల దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, వంటనూనె, పప్పులు అన్నింటి రేట్లు పెరగడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు కిలో 10 రూపాయలు ఉన్న టమాటా ఇప్పుడు ఏకంగా రూ.100 లకు పైనే పలుకుతుండడంతో సామాన్యులు ఆచితూచి వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ. 150 వరకు అమ్ముతున్నట్లు సమాచారం. టమాటానే కాదు.. పచ్చి మిర్చి రేట్లుకూడా భగ్గుమంటున్నాయి. దీంతో మార్కెట్ లో కూరగాయలు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో టమాటా విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఓ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సబ్సిడీ కింద రూ.50 లకే కిలో టమాటా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇంతకీ ఏ ప్రభుత్వం అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే నిత్యాసర సరకుల ధరల పెరుగుదలతో సామాన్యులు తలలు భాదుకుంటుంటే.. ఇప్పుడు కూరగాయలు కూడా పెనుభారంగా మారుతున్నాయి. ఈ మద్య కాలంలో మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగి వినియోగదారులకు భారీ షాక్కు గురిచేస్తోంది. ముఖ్యంగా వంటల్లో ప్రధానంగా వాడే టమాటాలు, పచ్చిమిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో టమాటా పంట దెబ్బతినడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. మొన్నటి వరకు రూ.10 ఉన్న టమాటా ఇప్పుడు ఏకంగా కిలో రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. దీంతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. టమాటాలను తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బాధ్యతను మార్కెటింగ్ శాఖకు అప్పజెప్పింది ఏపీ ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో రైతుల నుంచి టమాటాలను నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో రైతు బజార్లలోకి పంపించి కిలో రూ.50 కే అందుబాటులో తెచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడప, కర్నూలు జిల్లాల్లో బుధవారం నుంచి సబ్సిడీ పై టమాటాలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు సబ్సిడీపై టమాటాలను రైతు బజార్లలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. రైతుల నుంచి ప్రతిరోజూ 50 నుంచి 60 టన్నుల టమాటాలు సేకరించాలని అధికారులు నిర్నయించారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తున్నారు.