రెండు నెలల క్రితం వరకు టమాటా కేవలం రూ.20 నుంచి రూ.30 వరకు మాత్రమే పలికింది. గత నెల నుంచి టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి.. ఏకంగా కిలో 150 నుంచి 200 రూపాల వరకు పెరిగిపోయింది. దీంతో ప్రజలు టమాటాలు కొనాలంటే భయపడిపోతున్నారు. దాని బదులు రెండు మూడు రకాల కూరగాయాలు వస్తాయని అంటున్నారు.
గత నెల నుంచి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు కొనే పరిస్థితి కనబడడం లేదు. దీంతో ప్రభుత్వం రైతులు, వ్యాపారుల నుంచి మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి నష్టమైనా గానీ రైతు బజార్ల ద్వారా కిలో రూ. 50కే విక్రయిస్తోంది. ప్రస్తుతం ఏ ఏ జిల్లాల్లో విక్రయిస్తుందంటే?
మొన్నటి వరకు సరైన గిట్టుబాటు ధర లేదని రోడ్లపై పడవేసిన టమాటా ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. రూ.10 లకు పలికే టామాటా ఇప్పుడు ఏకంగా రూ.100 లకు పైనే పలుకుతుంది.