నేటి కాలంలో స్మార్ట్ ఫోన్.. డాటా వినియోగం మన నిత్య జీవితంలో భాగం అయ్యింది. లేచింది మొదలు.. మన జీవితాలు.. స్మార్ట్ఫోన్తోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల కోసం… పలు టెలికాం సంస్థలు.. ఎన్నో ప్యాక్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అలానే వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం టెలికాం సంస్థలు.. రకరకాల ప్యాక్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలకు ధీటుగా.. రకరకాల ప్యాక్లను తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ పైబర్నెట్ సంస్థ. 190 రూపాయలకే 400 జీబీ డేటా ప్యాక్ను తీసుకువచ్చింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలానే సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏపీఎస్ఎఫ్ఎల్ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. దీనిలో ఒకటి రూ.190కే 400 జీబీల డేటాను అందించనుంది. మరో 10 రోజుల్లో.. ఈ కొత్త ప్లాన్లను ప్రారంభించనున్నుట్ల.. గౌతమ్ రెడ్డి ప్రకటించారు. 19 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామని ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
ఇక ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినందుకుగాను.. ప్రీపెయిడ్ విధానంలో బిల్లులు చెల్లింపులు ఉంటాయని గౌతమ్ రెడ్డి తెలిపారు. ఏ ప్రాంతంలోనైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ను ప్రజలందరికి చేరువ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.